చాలామందికి అద్యాత్మికం అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది. అందరికి లీలగా తెలుసు కాని, ఎదుటివాల్లకు చెప్పేలాగ తెలియదు.
దానికి ఇన్నాళ్లకు ఓ మార్గం కనపడింది.
ఇంతకుముందు దేవుణ్ని నమ్మనివాడిని నాస్తికుడు అనేవాళ్లు. ఇప్పుడు తనని తాను కూడా నమ్ముకోనివాడిని నాస్తికుడు అనాలేమో! మిత్రమా! చెరువు చుట్టూ నువ్వు ఎంతసేపు తిరిగినా, మునకలోని సౌఖ్యమేమిటో నీకు అర్థంకాదు. ముందు నీటిలోకి దిగాలి. ఆధ్యాత్మిక అనుభవమూ అంతే! అదేమిటో చెబితేగానీ నువ్వు దిగనంటావు. దిగితేగానీ అర్థంకాదంటాను నేను.
-దీన్ని చెప్పింది వివేకానందుడే, కాని వెలికితీసి మనకు చెర్చింది మాత్రం పూడూరి రాజిరెడ్డి.